బూత్ స్థాయి ఓటర్ జాబితాలను ప్రదర్శించాలి

byసూర్య | Wed, Oct 30, 2024, 06:34 PM

బూత్ స్థాయిల్లో ఓటరు ముసాయిదా జాబితాలను ప్రదర్శించాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.  వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, పరిగి,  తాండూర్, కొడంగల్ నియోజకవర్గంలోని 1133 పోలింగ్ కేంద్రాల్లో ఓటరు ముసాయిదా  జాబితాలను ప్రదర్శింపచేయాలని ఆయన తెలిపారు.
వికారాబాద్ జిల్లాలోని అన్ని మండలాలతో పాటు నారాయణపేట 4 మండలాలు, మహబూబ్ నగర్ (2) మండలాలు గండిడ్,  మామదాబాద్ లలోని బూత్ స్థాయి అధికారులు మంగళవారం ఓటర్ ముసాయిదా జాబితాలను కార్యాలయ నోటీస్ బోర్డులలో ప్రదర్శింపచేయాలని ఆయన తెలిపారు. జిల్లాలోని ప్రజలందరికీ జాబితాలు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసినట్లయితే జాబితాలో తమ పేర్లు నమోదు కాని ఎడల 18 సంవత్సరాలు నిండిన యువత జనవరి 1, 2025 నాటికి ఓటరుగా నమోదు చేసుకునేందుకు వీలుగా ఉంటుందని అదనపు కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.l


Latest News
 

కుత్బుల్లాపూర్‌లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ Fri, May 16, 2025, 01:13 PM
ఇబ్రహీంపట్నంలో బిర్యానీలో బల్లి ఘటన.. యజమాని వివాదాస్పద వ్యాఖ్యలు Fri, May 16, 2025, 01:11 PM
రాజీవ్ యువ వికాసం దరఖాస్తులపై గందరగోళం Fri, May 16, 2025, 01:10 PM
తెలంగాణలో లైసెన్స్‌డ్‌ సర్వే అభ్యర్థులకు దరఖాస్తులు మే 17 నుంచి Fri, May 16, 2025, 01:08 PM
హైదరాబాద్‌లో ఆర్థిక ఇబ్బందులతో హోంగార్డు ఆత్మహత్య Fri, May 16, 2025, 01:07 PM