byసూర్య | Sat, Oct 19, 2024, 02:45 PM
గచ్చిబౌలి జోనల్ కమీషనర్ కార్యాలయంలో జోనల్ కమీషనర్ ఉపేందర్ రెడ్డిని రామచంద్రపురం డివిజన్ అభివృద్ధి కొరకు కార్పొరేటర్ పుష్ప నగేష్, ఎలక్ట్రిసిటీ ఎడి నాగరాజు, ఏఈ సంజీవ రావుతో శనివారం సమావేశం అయ్యారు. కరెంటు సమస్య తీవ్రంగా ఉంది అని, ప్రభుత్వం ద్వారా సబ్ స్టేషన్ కొరకు నిధులు మంజూరు అయి ఉన్నాయి అని, కావున సబ్ స్టేషన్ నిర్మించడానికి తగిన ప్రభుత్వం స్థలం కేటాయించాలి అని కార్పొరేటర్ వినతి పత్రం అందజేశారు.