byసూర్య | Sat, Oct 19, 2024, 04:57 PM
సిద్దిపేట నగర సంఘటన కార్యదర్శి బోయిని జగదీశ్ ఆధ్వర్యంలో సిద్దిపేట నగరంలో స్వామి వివేకానంద చౌరస్తాలో శనివారం దిష్టి బొమ్మ దహనం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో సిద్దిపేట నగర సంఘటన కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పాలకులు మారిన ప్రజల బ్రతుకులు మారడం లేదని గత పాలకులు విద్యారంగాన్ని పూర్తిగా విధ్వంసం చేశారని, గత 3 సంవత్సరాలుగా దాదాపు రూ. 7500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు.