byసూర్య | Sat, Oct 19, 2024, 04:54 PM
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలం అనంతారం భీమ్లా తాండాకి చెందిన సామ్యా నాయక్ తల్లి మాలి అనారోగ్యంతో హైదరాబాద్ పంజాగుట్ట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆపరేషన్ నిమిత్తం 2 లక్షల రూపాయలు మంజూరైంది. ఇందుకుగాను శనివారం హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి సామ్యా నాయక్ కి సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి పత్రాన్ని అందజేశారు.