byసూర్య | Thu, Oct 17, 2024, 06:25 PM
మనూర్ డావురు చౌరస్తా వద్ద 40 కిలోల నిషేధిత ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రూపేష్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 50 కిలోల హష్ ఆయిల్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయిని తరలిస్తే 8712656777 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని కోరారు.