byసూర్య | Thu, Oct 17, 2024, 06:29 PM
అకారణంగా షాద్నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గురువారం రాష్ట్ర డిజిపి జితేందర్ దృష్టికి తీసుకెళ్లారు. బీఆర్ఎస్ నాయకుల బృందంతో కలిసి డిజిపి కి వినతి పత్రం అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.