byసూర్య | Fri, Oct 18, 2024, 08:56 PM
మున్సిపాలిటీలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న చెరువులకు ఫెన్సింగ్ వేయించాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్లు ప్రతిరోజు వార్డులో పర్యటించాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.