byసూర్య | Thu, Oct 17, 2024, 06:20 PM
బతుకమ్మ, దసరా పండగల సందర్భంగా కరీంనగర్ రీజియన్ పరిధిలో ఆర్టీసీకి రూ. 31. 50 కోట్ల ఆదాయం సమకూరిందని ఆర్ఎం ఎన్. సుచరిత ఒక ప్రకటనలో గురువారం వెల్లడించారు. ఈ ఆదాయ సముపార్జనలో శక్తివంచన లేకుండా కృషి చేసిన ఆర్టీసీ సంస్థ సిబ్బందికి, ప్రత్యేకంగా డ్రైవర్, కండక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ సేవలపై నమ్మకముంచి ఇంతటి ఆదాయాన్ని ఆర్జించుటలో సహకరించిన ప్రయాణికుడికి సంస్థ తరఫున ధన్యవాదాలు తెలిపారు