byసూర్య | Wed, Jun 19, 2024, 04:41 PM
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ, లౌకిక విలువల రక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారని అన్నారు.