byసూర్య | Wed, Jun 19, 2024, 04:49 PM
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో బుధవారం సిపిఎం పార్టీ రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ రాజకీయ పాఠశాల శిక్షణ తరగతులు స్థానిక ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. ఈ రాజకీయ శిక్షణ తరగతులు రెండు రోజులపాటు జరుగుతాయి. ఈ శిక్షణా తరగతుల్లో పార్టీ సిద్ధాంతాలు, సమకాలిన రాజకీయ పరిస్థితులపై పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇస్తారు.