byసూర్య | Wed, Jun 19, 2024, 05:05 PM
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం ఆటో చోరీకి గురైన ఘటన చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డు స్టేన్లీ మోడల్ స్కూల్ ఎదుట ఒక ఆటో డ్రైవర్ తన ఆటోను స్కూల్ ఎదుట నిలిపి, తమ పిల్లలను స్కూల్లో దించి తిరిగి రాగా ఆటో కనిపించలేదు. ఆందోళనకు గురైన డ్రైవర్ సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని గమనించగా గుర్తు తెలియని వ్యక్తులు ఆటోను తీసుకెళ్తున్న దృశ్యం కనిపించింది. వివరాలు తెలియాల్సి ఉంది.