byసూర్య | Wed, Jun 19, 2024, 04:38 PM
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణంలోని దేవాలయాల చరిత్రపై సంజీవ నాయుడు రచించిన పుస్తకాన్ని బుధవారం ఉదయం శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగులాంబ ఆలయ ఈవో పురేందర్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఆలయాల చరిత్ర ఎంతో అద్భుతంగా ఈ పుస్తకంలో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ, హనుమంతరావు, సంజీవ నాయుడు, అడ్వకేట్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.