byసూర్య | Wed, Jun 19, 2024, 04:37 PM
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ రోడ్డులో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని బుధవారం పట్టణ ప్రజలు కోరుతున్నారు. మూడు రోజులుగా కూరగాయల వ్యర్థ పదార్థాలు, చెత్త తొలగించని కారణంగా తీవ్ర దుర్వాసన వస్తుందని, అటుగా వెళ్లేందుకు వీలులేని పరిస్థితి నెలకొందని వాపోయారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే చెత్తను తొలగించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.