బీఆర్ఎస్ సోషల్ మీడియా ఓ దండుపాళ్యం బ్యాచ్‌లా తయారైందని ఆగ్రహం

byసూర్య | Sat, Oct 26, 2024, 05:58 PM

తాను అనని మాటలను అన్నట్లుగా ట్రోలింగ్ చేస్తే లీగల్ నోటీసులు ఇస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి హెచ్చరించారు. తనను ఇష్టారీతిన ట్రోలింగ్ చేస్తున్న వారు తనకు దొరికితే బహిరంగంగానే బట్టలు ఊడదీసి కొడతానని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనపై, సీఎంపై, ఇతర కాంగ్రెస్ నేతలపై చేస్తున్న ట్రోలింగ్‌ పట్ల ఆయన తీవ్రంగా స్పందించారు.ఇటీవల కొంతమంది సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రుల మీద కూడా సోషల్ మీడియా వేదికగా అవాకులు, చెవాకులు పేలుతున్నారని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయకుల ప్రసంగాలను ఇష్టారీతిన ఎడిట్ చేసి ట్రోలింగ్ చేస్తున్నారని ఆరోపించారు.తాను ఓ మహిళా కలెక్టర్‌ను బూతులు తిట్టినట్లు సోషల్ మీడియాలో దారుణమైన పోస్టులు పెడుతున్నారన్నారు. కానీ తాను ఏ కలెక్టర్‌నూ దూషించలేదని జగ్గారెడ్డి వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో తమపై జరుగుతున్న ప్రచారం సరికాదన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఓ దండుపాళ్యం బ్యాచ్‌లా తయారయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Latest News
 

గుస్సాడీ కనకరాజు అసామాన్యుడు.. ఆయన మరణం తీరని లోటు: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 07:48 PM
డిప్యూటీ సీఎం భట్టి, మంత్రుల ఫోన్లు ట్యాపింగ్‌.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు Sat, Oct 26, 2024, 07:46 PM
నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఎన్నికలు.. హైకోర్టులో పిటిషన్ Sat, Oct 26, 2024, 07:44 PM
బాలకృష్ణకు సీఎం రేవంత్ బంపరాఫర్.. సాయంత్రం కేబినెట్ భేటీలో తుది నిర్ణయం Sat, Oct 26, 2024, 07:43 PM
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై బిగ్ అప్డేట్.. వచ్చే వారంలోనే.. మంత్రి పొంగులేటి Sat, Oct 26, 2024, 07:41 PM