byసూర్య | Tue, Jun 18, 2024, 03:37 PM
మంథని మండలం లక్కేపూర్ కి చెందిన ఎరుకల రేఖ ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చేరింది. సహాయం కోసం కుటుంబ సభ్యులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లగా, బాధిత కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తం 2లక్షల 10వేల ఎల్ఓసి మంజూరు చేయించారు. చెక్కును మంత్రి ఆస్పత్రి సహాయకులు సోమవారం హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో అందించారు.