byసూర్య | Tue, Jun 18, 2024, 03:35 PM
మెట్పల్లి మండలంలోని ఆత్మకూర్ గ్రామానికి చెందిన సీనియర్ ఆర్ఎంపీ వైద్యుడు నందగిరి గంగా భూమేశ్వర్ సోమవారం మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వైద్యుడిగా ఆయన అందించిన సేవలు మరువలేనివని, ఆయన మృతి తీరని లోటని పలువురు పేర్కొన్నారు.