byసూర్య | Sun, Jun 16, 2024, 07:20 PM
చదువు నేర్పడం మీ వంతు. వసతుల కల్పన నా వంతని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. జయశంకర్ బడిబాటలో భాగంగా ఆదివారం మిర్యాలగూడ ఎస్పీ కన్వెన్షన్లో నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ బడుల బలోపేతం కోసం ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతుల కల్పన సమస్యల పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానన్నారు.