byసూర్య | Sun, Jun 16, 2024, 07:22 PM
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో అక్రమంగా ఆవులను తరలిస్తున్న డీసీఎంను పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై రాంమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున పెట్రోలింగ్ చేయుచుండగా డీసీఎం వాహనంలో నిడమనూరుకు చెందిన సతీష్ అనే వ్యక్తి 12 ఆవులను అక్రమంగా హైదరాబాదుకు రవాణా చేయుచుండగా పట్టుబడి చేసి కేసు నమోదు చేసి, పట్టుబడిన పశువులను గోశాలకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.