byసూర్య | Sun, Jun 16, 2024, 07:17 PM
రామాయణాన్ని తెలుగులోకి అనువదించిన తొలి తెలుగు మహిళా కవయిత్రి శ్రీ కుమ్మర మొల్లమాంబ విగ్రహా ప్రతిష్టకు ఆదివారం మిర్యాలగూడ కుమ్మరసంఘ ప్రతినిధులు భూమి పూజ చేశారు. సంఘ సభ్యులు వేణుబాబు, రాములు, రేణుబాబు, రామకృష్ణ మాట్లాడుతూ.. మొల్లమాంబ చరిత్ర భవిష్యత్తరాలకు తెలిసేలా ఆమె విగ్రహ ఏర్పాటుకు సహకరించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ లకు కృతజ్ఞతలు తెలిపి ఆషాడమాసంలో విగ్రహ ప్రతిష్ట చేపడుతామన్నారు.