byసూర్య | Sun, Jun 16, 2024, 07:15 PM
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు జనవిజ్ఞాన వేనిక ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత మందులను రోగులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శ్రీనివాస రాజు అన్నారు. జెవివి మిర్యాలగూడ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం డాక్టర్ గోపాలం శివన్నారాయణ బృందం మూర్ఛ, పక్షవాతం, బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు వైద్యపరీక్షలు జరిపి ఉచితమందులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో శేఖర్ రెడ్డి, లక్ష్మినారాయణ శర్మ, శ్రీనివాస్, రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.