byసూర్య | Wed, May 29, 2024, 11:36 AM
యాచారం మండలం చౌదర్పల్లిలోని శ్రీ హరిహర దివ్య క్షేత్రంలో బుధవారం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో గతేడాది గ్రామస్తులు శ్రీ హరిహర దివ్య క్షేత్రాన్ని నిర్మించారు. ఈ క్రమంలో రెండు రోజులుగా దివ్యక్షేత్రం ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరుగుతోంది. అందులో భాగంగా ఎమ్మెల్యే పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తిభావంతో ప్రశాంతత నెలకొంటుందని అన్నారు.