byసూర్య | Wed, May 29, 2024, 11:32 AM
ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రిని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ సందర్శించారు. పలు వార్డుల్లో తిరుగుతూ చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. మెటర్నిటీ వార్డ్ ను సందర్శించి గర్భిణులతో మాట్లాడారు. వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆదివాసీ, గిరిజనుల ఆరోగ్య సేవల కోసం ఏర్పాటు చేసిన వార్డును సందర్శించి గిరిజనులకు అందిస్తున్న సేవలపై వైద్యులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.