byసూర్య | Tue, May 28, 2024, 07:29 PM
బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో ఇటీవల ఈదురు గాలులతో దెబ్బతిన్న ఇండ్లను మంగళవారం ఎంపీపీ దొడ్ల నీరజ వెంకటరామిరెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి నిత్యవసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు గోపనపల్లి సాయిలు, నాయకులు పర్వం రెడ్డి, జలీల్, చిన్న సాయిలు పాల్గొన్నారు.