byసూర్య | Tue, May 28, 2024, 07:32 PM
భిక్కనూరు మండలం జంగంపల్లి, కాచాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ బృందం మంగళవారం సందర్శించి అకాల వర్షాలతో వరి ధాన్యం నష్టపోయిన వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. బిబిపేట మండలం మాందాపూర్, దోమకొండ మండలం అంబారిపేట ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు సందర్శించారు. అనంతరం రాజంపేట మండలం తలమడ్ల గ్రామాన్ని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ బృందం ప్రతినిధులు సందర్శించారు.