byసూర్య | Sat, Oct 19, 2024, 01:50 PM
అదనపు కలెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ ఎలిగేడు మండలంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ, మండలంలో పెండింగ్ ఉన్న ధరణి దరఖాస్తులు వివరాలు తెలుసుకున్న అదనపు కలెక్టర్ వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.
మీసేవా కేంద్రాల ద్వారా వివిధ సర్టిఫికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సకాలంలో వాటిని జారీ చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.ఈ తనీఖీల్లో తహసిల్దార్ బషీరుద్దిన్, నాయబ్ తహసిల్దార్ కిరణ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.