byసూర్య | Sat, Oct 19, 2024, 03:48 PM
వికారాబాద్ పట్టణంలోని శివరాం నగర్ సంతోషిమాత ఆలయ వార్శికోత్సవం ఈ నెల 25 న నిర్వహించడం జరుగుతుందని ఆలయ ధర్మకర్త మౌనిగారి పండరి నాథ్ శనివారం పేర్కొన్నారు. వార్షికోత్సవంలో భాగంగా ఈ నెల 25 న సుప్రభాత సేవ, కుంకుమార్చన, పుణ్య వచనం, అమ్మవారి అభిషేకం, భగవద్గీత, విష్ణుసహస్ర నామం మొదలగు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు.