byసూర్య | Sat, Oct 19, 2024, 01:46 PM
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని కీసరగుట్టలో శుక్రవారం మహిళా అఘోరి ప్రత్యక్షమయ్యారు. శ్రీ భవాని శివ దుర్గా సమేత రామలింగేశ్వర స్వామికి స్వయంగా తన చేతులతో భస్మాభిషేకం చేశారు.అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ మహిళా అఘోరి కొండపైన వెలిసిన శివలింగాలను స్పృశిస్తూ శివలింగాన్ని తాకి ఆనంద పరవశంలో ఒంటి కాలిపై నిలబడి ఆ దేవదేవుడిని ధ్యానించారు.