byసూర్య | Sun, May 26, 2024, 05:14 PM
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి వారి దేవాలయ కమిటీ సభ్యులు శనివారం పలువురు దాతల సహాయ సహకారాలతో పట్టణంలోని అభాగ్యులకు, నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మానవసేవే మాధవగా భావించి ప్రతి శనివారం స్వామి వారి పేరు మీద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.