byసూర్య | Sun, May 26, 2024, 05:17 PM
ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్ట భద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ పాలేరు నియోజకవర్గం రాయగూడెం గ్రామంలో పాల్గొన్న జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షుడు బోయిన వేణు ఆధ్వర్యంలో శనివారం ప్రచారం నిర్వహించారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్, బీజేపీ పాలకులు చేసిందేమీ లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, రాజబాబు, బోయిన సారధి, గాలం వీరబాబు, కోసూరి పానకాలు పాల్గొన్నారు.