byసూర్య | Thu, May 09, 2024, 10:07 PM
అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నేడు ప్రమాదంలో పడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.సరూర్నగర్ లో సీఎం మాట్లాడుతూ.. 18వ లోక్సభ ఎన్నికలు మన జీవన్మరణ సమస్య అని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కిన రిజర్వేషన్లు కూడా ప్రమాదంలో పడ్డాయని విమర్శించారు. రిజర్వేషన్లు రద్దు చేసేందుకు మోదీ, అమిత్ షా బయలుదేరారని చెప్పారు. ఇందిరాగాంధీ తన చివరిశ్వాస విడిచేటప్పుడు తెలంగాణ ఎంపీగానే ఉన్నారని.. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న మోదీ, అమిత్ షాపై రాహుల్గాంధీ యుద్ధం ప్రకటించారని చెప్పారు.