byసూర్య | Thu, May 09, 2024, 06:16 PM
ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్కు చెందిన ఎక్కల్దేవీ దేవవ్వ(65) వారం కిందట సొంత పని మీద సిరిసిల్లకు వెళ్లింది. అయితే తిరుగు ప్రయాణంలో సిరిసిల్ల బస్టాండ్లో బస్సు ఎక్కే క్రమంలో తోపులాటలో కింద పడి తీవ్ర గాయాలపాలైంది. గాయపడ్డ దేవవ్వను సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించటంతో బుధవారం మృతి చెందింది.