byసూర్య | Mon, May 20, 2024, 03:27 PM
పర్యావరణాన్ని కాపాడేలా రాష్ట్రంలో హరిత భవన నిర్మాణాలు జరగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైటెక్స్లో సీఐఐ, ఐజీబీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రీన్బిల్డింగ్ ప్రాపర్టీ షో ముగింపు కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొని సామాన్యుడు కొనుగోలు చేసేలా గ్రీన్ బిల్డింగ్స్ ఉండాలన్నారు. 50 శాతం నీరు, 40 శాతం కరెంట్ ను ఆదా చేసేలా నిర్మించే గ్రీన్ బిల్డింగ్స్ కు ప్రభుత్వం తరఫున సహకారం ఉంటుందన్నారు.