byసూర్య | Thu, May 09, 2024, 06:15 PM
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్ ఆధ్వర్యంలో గురువారం మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి హాజరయ్యారు. పార్టీలో చేరేందుకు వచ్చిన మహిళలను కండువా కప్పి స్వాగతించారు. పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రం ఇచ్చింది సోనియాగాంధీ అని గుర్తు చేశారు.