![]() |
![]() |
byసూర్య | Mon, May 20, 2024, 02:14 PM
దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్ మండలం మదిగట్ల గ్రామంలో బీరప్ప ఉత్సవాలు సోమవారం ప్రారంభించారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉత్సవాల్లో ఆయన డోలు కొట్టి నిర్వాహకులను ఉత్సాహపరిచారు. బీరప్ప స్వామి పూజలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.