రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ

byసూర్య | Fri, Jul 26, 2024, 10:50 PM

ప్రముఖ నటి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ శుక్రవారం (జులై 26) రోజున తెలంగాణ మంత్రి కొండా సురేఖను మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని మంత్రి ఇంటికి వెళ్లిన ఆమె.. పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక విషయాలపై చర్చించారు. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్‌గా వ్యవహరిస్తోన్న రేణు దేశాయ్.. ప్రపంచంలోనే తొలిసారిగా నెలకొల్పనున్న గీత యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా.. తమ ఇంటికి అతిథిగా వచ్చిన రేణు దేశాయ్‌కు తెలంగాణ సంప్రదాయంలో సారె (కొత్తబట్టలు, పండ్లు, పసుపు కుంకుమ) పెట్టారు. ఈ క్రమంలోనే సురేఖ కూతురు సుస్మిత పటేల్ స్పెషల్‌గా తెప్పించిన ఆభరణాన్ని రేణు దేశాయ్‌కి అందించటమే కాకుండా.. స్వయంగా తానే అలంకరించారు. మంత్రి కుటుంబ సభ్యులు తన పట్ల చూపిన ప్రేమాభిమానాల పట్ల రేణు దేశాయ్ హర్షం వ్యక్తం చేశారు.



Latest News
 

తెలంగాణ గ్రూప్ I పరీక్షతో ముందుకు సాగాలని ఆశావహుల నిరసన కొనసాగుతోంది Thu, Oct 17, 2024, 10:14 PM
పరువు నష్టం కేసులో స్టేట్‌మెంట్ ఇవ్వనున్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 10:00 PM
మూసీకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 09:00 PM
పోడు భూముల విషయంపై స్పందించిన మంత్రి సీతక్క Thu, Oct 17, 2024, 07:46 PM
ఈ నెల 23వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం Thu, Oct 17, 2024, 07:44 PM