byసూర్య | Sat, Jul 27, 2024, 09:05 AM
భద్రాచలం వద్ద మరోసారి హెచ్చరిక లు మోగుతున్నాయి. మొన్నటిదాకా 51 అడుగులకు చేరి ఆ తర్వాత మళ్లీ తగ్గి 47 అడుగులకు చేరిన నీటిమట్టం నిన్నటి నుంచి పెరుగుతూ వస్తోంది.ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వల్ల భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది . నిన్న 48 అడుగులకు చేరగా అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే ఇవాళ ఉదయం గోదావరి నీటిమట్టం ఒక్కసారిగా 51 అడుగులకు చేరింది. భద్రాచలం వద్ద ఇంకా నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉంది . నీటిమట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గత వారం రోజుల నుంచి భద్రాచలం దిగువ ఉన్న విలీన మండలాల్లోని అనేక గ్రామాలు వరద నీటిలోనే మునిగి ఉన్నాయి.