కళ్లుచెదిరిపోయేలా ఖైరతాబాద్ గణేషుడి ఆదాయం.

byసూర్య | Mon, Sep 16, 2024, 09:45 PM

ఖైరతాబాద్ మహాగణపతి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్. గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నో వింతలు, విశేషాలు, రికార్డులతో దూసుకెళ్తున్న ఖైరతాబాద్ బడా గణపతికి ఈసారి కనీవినీ ఎరుగని రీతిలో హుండీ ఆదాయం వచ్చినట్లు గణేష్ ఉత్సవ కమిటీ వెల్లడించింది. మంగళవారం నిమజ్జనం చేయనున్న నేపథ్యంలో సోమవారం హుండీ లెక్కింపు చేపట్టారు. పటిష్ఠమైన బందోబస్తు, సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో జరిగిన ఈ హుండీ లెక్కింపులో కళ్లు చెదిరే ఆదాయం వచ్చినట్లు చెప్పారు. కేవలం హుండీ ఆదాయం మాత్రమే కాకుండా ఆన్‌లైన్ పేమెంట్ల ద్వారా కూడా డబ్బు సమకూరింది. మరోవైపు యాడ్స్ ద్వారా కూడా లక్షల్లో ఖైరతాబాద్ మహా వినాయకుడికి ఆదాయం వచ్చినట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు.


గణేష్ చతుర్థి సందర్భంగా నవరాత్రులు పూర్తి చేసుకున్న ఖైరతాబాద్ మహాగణపతి.. గత 9 రోజులుగా ఘనంగా పూజలు అందుకుని.. రేపు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఇక 9 రోజులుగా ఖైరతాబాద్ మహా వినాయకుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు భారీగా నగదు, కానుకలు సమర్పించారు. ఈ క్రమంలోనే ఈసారి ఖైరతాబాద్ గణేషుడి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. కానుకల ద్వారా ఏకంగా రూ. 70 లక్షలు హుండీ ఆదాయం వచ్చినట్లు గణేష్ ఉత్సవ కమిటీ తాజాగా తెలిపింది. వీటితోపాటు హోర్డింగులు, ఇతర సంస్థల ప్రకటన రూపంలో మరో రూ. 40 లక్షలు సమకూరినట్లు పేర్కొన్నారు. ఇవేకాకుండా.. ఆన్‌లైన్ ద్వారా.. వినాయకుడి విగ్రహాల వద్ద ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ స్కానర్ల ద్వారా కూడా విరాళాలు వచ్చాయని.. అయితే వాటిని ఇంకా లెక్కించాల్సి ఉందని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.


ఇక హుండీ లెక్కింపును మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరిపారు. ఖైరతాబాద్‌లో గణపతి ఉత్సవాలు ప్రారంభమై దశాబ్దాలు గడుస్తున్నప్పటీ.. తొలిసారి ఈ ఏడాది హుండీ లెక్కింపు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరగడం విశేషం. బడా గణేష్‌ గంగమ్మ ఒడికి చేరనుండటంతో చివరి రోజు దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఇప్పటివరకు ఖైరతాబాద్ మహా గణపతి దర్శనం చేసుకున్నారు. నిమజ్జనం ఏర్పాట్లు జరుగుతుండటంతో చివరి రోజు భారీగా భక్తులు రావడంతో వెల్డింగ్.. ఇతర పనులకు ఆటంకం కలుగుతుంది. ఇక ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది.


ఇవాళ రాత్రి 9 గంటలకు ఖైరతాబాద్ మహా గణనాధుడికి మహా హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆ తర్వాత 11.30 గంటలకు కలశం పూజ చేస్తారు. అనంతరం రాత్రి 12 గంటల లోపు గణనాథుడిని కదిలించి.. ట్రాలీపైకి ఎక్కించనున్నారు. తర్వాత ట్రాలీని పూలు, లైట్లతో సర్వాంగ సుందరంగా అలంకరించనున్నారు. మంగళవారం ఉదయం 6.30 గంటలకు గణేష్ శోభాయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1.30 లోపు ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జన కార్యక్రమం పూర్తిచేస్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.


Latest News
 

గణేష్ నిమజ్జనోత్సవంలో అపశృతి.. తండ్రిని కాపాడే ప్రయత్నంలో కూతురు మృతి Wed, Sep 18, 2024, 10:11 PM
21 గ్రామాల మీదుగా,,,,,హైదరాబాద్ సమీపంలో 6 లైన్ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి Wed, Sep 18, 2024, 10:08 PM
బీజేపీ మహిళా ఎంపీ హీరోయిన్ కంగనా రౌనత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ Wed, Sep 18, 2024, 10:07 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. దంచికొట్టనున్న వానలు, నేటి వెదర్ రిపోర్ట్ Wed, Sep 18, 2024, 10:06 PM
నవంబర్ 10 లోగా బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే, ప్రభుత్వంపై పోరాటం తప్పదు : కేటీఆర్ Wed, Sep 18, 2024, 10:02 PM