byసూర్య | Thu, May 09, 2024, 06:13 PM
రామగుండం మున్సిపల్ పరిధిలోని 20వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శిరిశెట్టి సతీష్ ఆధ్వర్యంలో రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ సమక్షంలోబి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, యువకులు భారీ సంఖ్యలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్ మహంకాళి స్వామి, తదితరులు పాల్గొన్నారు.