byసూర్య | Thu, May 09, 2024, 06:11 PM
పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపు కోసం ధర్మారం మండలంలోని నంది మేడారం, ఖానంపల్లి, ఖిలవనపర్తి గ్రామాలలో పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి గతంలో కొప్పుల ఈశ్వర్ మంత్రిగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పెద్దపల్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్ ను కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.