byసూర్య | Thu, May 09, 2024, 06:09 PM
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం విస్తృత ప్రచారం నిర్వహించారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఇంటింటికి వెళ్లి హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే స్థానిక ఓ ఎయిర్ సెలూన్ షాప్ కు వెళ్లి హెయిర్ కటింగ్ చేస్తూ వినూత్న ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.