byసూర్య | Thu, May 09, 2024, 03:41 PM
ఓదెల మండలం హరిపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గట్టు యాదవ్, శివశంకర్, అమ్ముల బిక్షపతి, రామస్వామి, అటెపల్లి రాజు, ఎర్రయ్య, సదయ్య, గుండేటి రాములు, రాజ్ కుమార్, శ్రీచరణ్, శ్రీకాంత్, సోమయ్య పాల్గొన్నారు.