byసూర్య | Thu, May 09, 2024, 03:44 PM
సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామంలో బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కి మద్దతుగా గురువారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు వేల్పుల రాజన్న పటేల్ తో కలిసి జాతీయ ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి మద్దతు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు నల్లవేల్లి శంకర్, నర్సింగోజు రమేష్ పాల్గొన్నారు.