కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులకు మల్కాజిగిరిలో ఓటు హక్కు కూడా లేదు

byసూర్య | Thu, May 09, 2024, 03:50 PM

మల్కాజిరి పార్లమెంట్ కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలోని బేగంపేట్ డివిజన్ కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో బుధవారం మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కుమార్తె డాక్టర్ మౌనిక రెడ్డి తన తండ్రి గెలుపును ఆకాంక్షిస్తూ రోడ్ షో మరియు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జాతీయ పార్టీల అహంకార భావంతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అనదొక్కాలని ప్రయత్నిస్తున్న వారికి ఓటు అనే ఆయుధంతో కారు గుర్తుపై ఓటు వేసి తగిన గుణపాఠం చెప్పాలని తెలియజేశారు. కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులకు మల్కాజిగిరిలో ఓటు హక్కు కూడా లేదని ఆరు గ్యారెంటీలని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, మహిళ సోదరీమణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..


Latest News
 

బీరప్ప ఉత్సవాల్లో దేవరకద్ర ఎమ్మెల్యే Mon, May 20, 2024, 02:14 PM
మందుల దుకాణాన్ని ప్రారంభించిన విప్ Mon, May 20, 2024, 02:09 PM
బెంగళూరులో రేవ్ పార్టీ.. Mon, May 20, 2024, 01:16 PM
బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానం Mon, May 20, 2024, 01:08 PM
అదుపుతప్పి లారీ బోల్తా Mon, May 20, 2024, 01:08 PM