byసూర్య | Thu, May 09, 2024, 03:53 PM
జుక్కల్ మండలంలోని పెద్ద గుల్ల గ్రామ సొసైటీ డైరెక్టర్ విట్టల్ పటేల్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఖండెబల్లూర్ గ్రామ అధ్యక్షులు రాజు, రాంచందర్, కృష్ణ ఆధ్వర్యంలో గ్రామ యువకులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ వినోద్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.