byసూర్య | Thu, May 09, 2024, 03:29 PM
సమ్మర్ క్యాంపును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా యువజన క్రీడా అధికారి దామోదర్ రెడ్డి అన్నారు. గురువారం నాగిరెడ్డిపేట మండలం బొల్లారం జడ్పి ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రతిరోజు ఉదయం 6గ, నుండి 8గ సాయంత్రం 5గ నుండి 7గ గంటల వరకు నిర్వహించే సమ్మర్ క్యాంపుకు హాజరై కొత్త విషయాలు నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు.