byసూర్య | Thu, May 09, 2024, 03:21 PM
బిచ్కుంద మండల కేంద్రంలోని కమ్మరి చెరువులో జరుగుతున్న ఉపాధి హామీ పనుల వద్దకు గురువారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ స్థానిక నాయకులతో కలిసి ఉపాధి హామీ కూలీల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి సురేష్ శెత్కార్ ను ఆదరించి గెలిపించాలని ఆయన కూలీలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.