byసూర్య | Sat, Apr 27, 2024, 09:20 PM
తెలంగాణలో సీనియర్ ఐఏఎస్, ఫైనాన్స్ కమిషన్ మెంబర్ స్మితా సబర్వాల్.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఫాలోవర్లతో నిత్యం టచ్లో ఉంటుంటారు. సమాజంలో జరుగుతున్న ట్రెండింగ్ టాపిక్లపై స్పందిస్తూనే.. తనకు సంబంధించిన ఫొటోలు కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా.. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన పవర్ వుమెన్ కార్యక్రమంలో పాల్గొన్న ఫొటోలను స్మితా సబర్వాల్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో షేర్ చేసుకున్నారు.