byసూర్య | Fri, May 10, 2024, 01:36 PM
మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను ఆగం చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీకి ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని బూర్గంపాడు జెడ్పిటిసీ కామిరెడ్డి శ్రీలత పిలుపునిచ్చారు. బూర్గంపాడు మండలం వేపలగడ్డలో మహబూబాబాద్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవితని గెలిపించాలని కోరుతూ శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలను కలిసి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు.