byసూర్య | Fri, May 10, 2024, 11:50 AM
చిన్న చిన్న తండాలను గ్రామాలుగా మార్చి వారి గ్రామాలను వారే పాలించుకునే విధంగా వెసులుబాటు కల్పించిన ఘనత కేసీఆర్ దే అని మాజీమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ రఘునాథపాలెం మండలం చింతగుర్తి, కొర్లబోడుతండా, రాంక్యతండా గ్రామాల్లో శుక్రవారం ఉపాధి హామీ పని ప్రదేశంలో కూలీలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. కాంగ్రెస్ వచ్చిన ఐదేళ్ళలోనే కరువు వచ్చిందన్నారు.