byసూర్య | Fri, May 10, 2024, 01:55 PM
శంషాబాద్ మండల పరిధిలో ఉరేసుకుని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. శంషాబాద్ పోలీసుల వివరాలు.. నర్కూడకు చెందిన పర్వతం అరుణ్ (20) 2 నెలలుగా ఓ కొరియర్ సంస్థలో పని చేస్తున్నాడు. రోజూ మాదిరిగా కుటుంబసభ్యులు పనులకు వెళ్లినా అరుణ్ విధులకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉన్నాడు. అనంతరం గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.